పదవీ విరమణ అనంతరం రూ. 50 లక్షల మూలధనంతో ప్రశాంత జీవనం గడపాలనుకునే వారికి, ఆ డబ్బుతో ఏం చేయాలనే ఒక ప్రధాన సందేహం ఎదురవుతుంటుంది. నెలవారీ ఖర్చులకు అవసరమైన ఆదాయాన్ని పొందుతూనే, ద్రవ్యోల్బణం బారి నుంచి అసలు మొత్తాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తుంటారు. అయితే, ఇందుకు పరిష్కార మార్గాలు ఉన్నాయి. కేవలం ఒకే రకమైన పెట్టుబడిపై ఆధారపడకుండా, వివిధ పథకాల్లో పెట్టుబడులను మళ్లించడం శ్రేయస్కరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు 'ఇండియా టుడే' ఓ కథనం ప్రచురించింది.సంప్రదాయబద్ధంగా చాలామంది సురక్షితమని మార్గమని భావించి ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వైపే మొగ్గు చూపుతారు. అయితే, పెరుగుతున్న ధరలు, వైద్య ఖర్చుల దృష్ట్యా కేవలం ఎఫ్డీల ద్వారా వచ్చే వడ్డీ దీర్ఘకాలిక అవసరాలకు సరిపోకపోవచ్చు. ద్రవ్యోల్బణం కారణంగా నగదు విలువ క్రమంగా తగ్గుతుంటుంది. కాబట్టి, ఎఫ్డీలతో పాటు ప్రభుత్వ హామీ కలిగిన సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని వృద్ధిని సాధించే మ్యూచువల్ ఫండ్లలోనూ పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.ఫిన్వాసియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రామ్నీక్ ఘోత్రా అభిప్రాయం ప్రకారం, రిస్క్ తగ్గించుకోవడానికి పెట్టుబడులు వైవిధ్యీకరణ ఎంతో కీలకం. నిపుణుల విశ్లేషణ ప్రకారం, రూ. 50 లక్షల మొత్తంలో సుమారు 30 శాతం ఎస్సీఎస్ఎస్లో, 25 శాతాన్ని వివిధ కాలపరిమితులు గల ఎఫ్డీలలో, మరో 30 శాతాన్ని కన్జర్వేటివ్ హైబ్రిడ్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఉత్తమం. మిగిలిన మొత్తాన్ని అత్యవసర అవసరాల కోసం లిక్విడ్ ఫండ్లలో ఉంచుకోవడం శ్రేయస్కరం.ఈ మిశ్రమ
Actor ProfilePolitician
రిటైరయ్యాక మీ చేతికి రూ.50 లక్షలు వస్తే.. ఏం చేస్తారు
Total News1
Movie Updates0
Sources1
AP7AM•13 Jun 2026
రిటైరయ్యాక మీ చేతికి రూ.50 లక్షలు వస్తే.. ఏం చేస్తారు