రోజుల్లోనే ఖాతాదారులకు సొమ్ము వాపస్
Actor ProfilePolitician

రోజుల్లోనే ఖాతాదారులకు సొమ్ము వాపస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రోజుల్లోనే ఖాతాదారులకు సొమ్ము వాపస్
Eenadu19 Jul 2026
రోజుల్లోనే ఖాతాదారులకు సొమ్ము వాపస్

క్రెడిట్‌ కార్డు మోసాలపై బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం 2027 జనవరి 1 నుంచి అమలు ముంబయి: క్రెడిట్‌ కార్డులు, డిజిటల్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకుంది. క్రెడిట్‌ కార్డు మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా, సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్సల్‌ లేదా ప్రొవిజనల్‌ క్రెడిట్‌ (తాత్కాలికంగా నగదు బదిలీ) రూపంలో ఖాతాదారుడి ఖాతాకు జమ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. డిజిటల్‌ లావాదేవీల్లో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేసే విధంగా సవరించిన నిబంధనలను ఆర్‌బీఐ (RBI Digital Fraud Compensation Rules) విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మోసం ఎలా జరిగినా ఖాతాదారులపై ఎటువంటి బాధ్యత పడని సందర్భాలపై ఆర్‌బీఐ (RBI) స్పష్టత నిచ్చింది. బ్యాంక్‌ వైపు ఉన్న లోపాలు లేదా నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే.. ఖాతాదారుడు ఆ విషయాన్ని ఫిర్యాదు చేసినా, చేయకపోయినా సరే ‘లావాదేవీని రద్దు చేసి, పూర్తి సొమ్మును బ్యాంకే వెనక్కి ఇవ్వాలి’. బ్యాంక్‌ లేదా ఖాతాదారుడి తప్పు లేకుండా ఏదైనా థర్డ్‌ పార్టీ హ్యాకింగ్‌ వల్ల మోసం జరిగితే, ఆ లావాదేవీ జరిగిన 5 క్యాలెండర్‌ రోజుల్లోపు ఖాతాదారుడు బ్యాంకుకు నివేదిస్తే, వారిపై ఎటువంటి బాధ్యత ఉండదు. ఒకవేళ 5 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే, బ్యాంక్‌ పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. ఖాతాదారుడు మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన తర్వాత, ఆ ఖాతా నుంచి మళ్లీ ఎటువంటి అనధికార లావాదేవీలు జరిగినా.. బ్యాంకులే ఆ నష్టాన్ని భరించాలి. బ్యాంకులు మోసపూరిత లావాదేవీ సొమ్మును వెనక్కి ఇచ్చేటపుడు, అది ఏ రోజు అయితే జరిగిందో అదే తేదీతో జమ చేయాలి. దీని వల్ల ఖాతాదారుడు ఎటువంటి వడ్డీ నష్టాన్ని లేదా అదనపు వడ్డీ ఛార్జీల