
పెరుగుతున్న ఇంధన ధరలతో సతమతమవుతున్న సామాన్య వాహనదారులకు ఉపశమనం కల్పించే దిశగా మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ అధినేత రాజ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్పై ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. ఈ పథకం కింద నగరంలోని ఎంపిక చేసిన 36 పెట్రోల్ బంకుల్లో టూవీలర్లకు లీటర్ పెట్రోల్పై రూ.5 తగ్గింపును అందిస్తోంది. రాజ్ థాకరే పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఒక్కరోజు పాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.దేశంలో ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్యుల బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో ఎంఎన్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం ద్వారా సామాన్యులపై పడుతున్న ఆర్థిక భారాన్ని కొంతమేర తగ్గించడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు.ఈ చొరవపై ఎంఎన్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ జై శృంగార్పురే మాట్లాడుతూ.. "ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి సమయంలో మా వంతుగా ప్రజలకు కొంత మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం" అని వివరించారు.మరో ఎంఎన్ఎస్ నేత సందీప్ దేశ్పాండే ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పెట్రోల్ ధరల భారాన్ని అంతిమంగా ప్రజలే మోస్తున్నారని, వినియోగదారులపై ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు కూడా ఇంధన ధరలపై ప్రభావం