రికార్డు ధర పలికిన హైదరాబాద్ భూముల
Actor ProfileCelebrity

రికార్డు ధర పలికిన హైదరాబాద్ భూముల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రికార్డు ధర పలికిన హైదరాబాద్ భూములపై న్యాయ వివాదం.. ఎస్బీఐ పిటిషన్ తో వేలానికి బ్రేక్
AP7AM18 Jun 2026
రికార్డు ధర పలికిన హైదరాబాద్ భూములపై న్యాయ వివాదం.. ఎస్బీఐ పిటిషన్ తో వేలానికి బ్రేక్

హైదరాబాద్ నగరంలోని రాయదుర్గంలో ఇటీవల రికార్డు ధర పలికిన అత్యంత ఖరీదైన భూముల వేలం ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. వేలం వేసిన భూమిలో కొంత భాగం తమదేనంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దాఖలు చేసిన పిటిషన్‌తో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఉత్తర్వులతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ లావాదేవీపై సందిగ్ధత నెలకొంది.రాయదుర్గం పాన్‌మక్తాలోని నాలెడ్జ్ సిటీ పరిధిలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఈ-వేలం వేయడాన్ని సవాలు చేస్తూ ఎస్బీఐ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. సుమారు 5 ఎకరాల భూమికి సంబంధించిన ఈ వివాదంలో మూడు వారాల పాటు వేలం మరియు తదనంతర ప్రక్రియలను నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు టీజీఐఐసీ, ఎస్బీఐతో పాటు వేలంలో భూమిని దక్కించుకున్న గౌరా వెంచర్స్‌కు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు.టీజీఐఐసీ మే 28న నిర్వహించిన వేలంలో 6.29 ఎకరాల భూమి ఎకరానికి రూ. 237 కోట్ల రికార్డు ధర పలికి, మొత్తంగా సుమారు రూ. 1,490 కోట్లను ఆర్జించింది. అనంతరం జూన్ 1న జరిగిన మరో వేలంలో 5.09 ఎకరాల భూమి ఎకరానికి రూ. 204 కోట్ల చొప్పున రూ. 1,038 కోట్లకు విక్రయించబడింది.వివాదంలో ఉన్న 5 ఎకరాల భూమిని 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు కేటాయించిందని