
వేటూరి గారి పాటల్లో ప్రాసలు ఎంత సహజంగా వస్తాయో ఈ పాటలో కనిపిస్తుంది. 'యమహానగరి... కలకత్తాపురి' అనేది తెలుగు చలనచిత్ర రంగంలోనే కాకుండా, లలిత సంగీత శైలిలో, సాహిత్య పరంగా ఒక మైలురాయి లాంటి పాట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మణిశర్మ సంగీత దర్శకత్వంలో, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'చూడాలని వుంది' (1998) సినిమాలోనిది ఈ అద్భుతమైన పాట. ఈ పాటను మహాకవి, సాహితీ బ్రహ్మ వేటూరి సుందరరామ్మూర్తి రాయగా, హరిహరన్ పాడారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా వచ్చింది. పాటంటే ఎప్పుడూ డ్యూయెట్లు రాసుకోవడం కాదు..ఒక్కొక్కసారి ప్రదేశాలు, హిస్టరీ గురించి రాయాల్సి వస్తుందని వేటూరి అనేవారు. అలాంటి సందర్భంలోనే చూడాలని వుంది సినిమాలో కలకత్తా నగరం వివరిస్తూ ఈ పాట రాశారు. రఘువంశ సుధాంబుది చంద్ర శ్రీ నుంచి ఈ పాట తీసుకున్నారట. యమహానగరి అనడానికి కారణం మహానగర్ అంటే కలకత్తాకు పేరు. ఇండియా మొత్తం మీద మహానగర్ అంటారు. సత్య జిత్ రే పేరుతో 1963లో బెంగాళీ సినిమా కూడా తీశారు. కలకత్తాను... బ్లాక్ హోల్ ఆఫ్ కలకత్తా అంటారు. యముడు నివసించే చోటులా ఉంటుందంట. అంత భయంకరమైన నేరాలు, ఘోరాలు జరిగేవి కాబట్టే...యమహానగరి అని రాయడం జరిగింది. ఇందులో కలకత్తా నగరం గొప్పదనం గురించే కాదు, అక్కడ జన్మించిన మహానుభావుల గురించి ప్రస్తావించారు. ఇదొక చరిత్రాత్మక పాట అని ఓ సందర్బంలో వేటూరి గారు అన్నారు. వారి వ్యక్తిత్వాలు, వారి దేశభక్తి, కలకత్తా కళలు, సంప్రదాయాలు, పరిస్థితుల గురించి ఒకే ఒక్క పాటలో పొందుపరిచారు. ఈ పాట పాడటానికి హరిహరణ్ భయపడ్డారట. అందులో మెలికలు కలకత్తా నగరపు కిట కిటలో, ఒకరితో ఒకరికి ముఖపరిచేయములు దొరకని క్షణముల....లిరిక్స్ ను పాడలేకపోయారంట. అందుకోసం రాత్రంబవళ్లు కష్టపడ్డారట. ఏన్నో టేక్ లు తీసుకున్నారట. అయినా హరిహరణ్ గెలిచారని వేటూరి అన్నారు. ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారట. ఈ పాట అంత