యాదాద్రి ఆలయ బోర్డులో చిరంజీవి సతీమణి సురేఖకు కీలక బాధ్యత
Actor ProfilePolitician

యాదాద్రి ఆలయ బోర్డులో చిరంజీవి సతీమణి సురేఖకు కీలక బాధ్యత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
యాదాద్రి ఆలయ బోర్డులో చిరంజీవి సతీమణి సురేఖకు కీలక బాధ్యత
Zee Telugu26 Aug 2026
యాదాద్రి ఆలయ బోర్డులో చిరంజీవి సతీమణి సురేఖకు కీలక బాధ్యత

Surekha Konidela:తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పాలక మండలిని కొత్తగా ఏర్పాటు చేసింది. ఆలయ పరిపాలనను మరింత సమర్థంగా నిర్వహించడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో ఈ కొత్త పాలక మండలిని రూపొందించింది. తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కొత్త బోర్డులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొనిదెలకు సభ్యురాలిగా అవకాశం కల్పించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె నియామకంపై సినీ అభిమానులతో పాటు భక్తుల్లో కూడా ఆసక్తి నెలకొంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే సురేఖకు ఈ బాధ్యత రావడం విశేషంగా మారింది. కొత్తగా ఏర్పాటు చేసిన పాలక మండలికి ఎం. సత్యనారాయణ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించారు. మొత్తం 18 మంది సభ్యులతో ఈ బోర్డు పనిచేయనుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఇందులో చోటు కల్పించారు. వారి అనుభవంతో ఆలయ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నియమిత సభ్యులతో పాటు పలువురు పదవీరీత్యా కూడా పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ముఖ్య కార్యదర్శి, ఎండోమెంట్స్ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్, ఆలయ కార్యనిర్వాహణ అధికారి, ప్రధాన అర్చకులు ఈ బోర్డులో భాగం కానున్నారు. ఈ పాలక మండలి సభ్యుల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. త్వరలోనే కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉంది. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయ పరిపాలన, అభివృద్ధి పనులు, భక్తులకు అవసరమైన సౌకర్యాలు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ వంటి కీలక అంశాలపై ఈ బోర్డు నిర్ణయాలు తీసుకోనుంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం తెలంగాణలో