
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. US Attacks Iran Again: మళ్లీ మొదటికే వచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఆగడం లేదు, మళ్ళీ అమెరికా ఇరాన్ మీద విరుచుకుపడింది. ఒకవైపు గల్ఫ్ దేశాలు తమపై ఇరాన్ దాడి చేస్తుందేమో అని భయపడుతుంటే, మరోవైపు ఇండియా వంటి దేశాలు మళ్ళీ చమురు, గ్యాస్ కష్టాలు వస్తాయేమో అని టెన్షన్ పడుతున్నాయి. అమెరికా మిలిటరీ ఇరాన్ తీర ప్రాంతాలతో పాటు మిస్సైల్ స్టోరేజ్ ఫెసిలిటీపై దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ కన్ఫర్మ్ చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగిన తర్వాత ఇలా డైరెక్ట్ అటాక్ జరగడం ఇదే మొదటిసారి. సింగపూర్ షిప్ మీద ఇరాన్ దాడి చేసినందుకు ట్రంప్ ఖండించిన కొద్దిసేపటికే అమెరికా ఇలా అటాక్ చేయడం గమనార్హం. హార్ముజ్ స్ట్రెయిట్ పంతమే కారణమా? అమెరికా ఇరాన్ మీద దాడి చేయడానికి ఒక కారణం ఉందని నిపుణులు అంటున్నారు. హార్ముజ్ స్ట్రెయిట్ అంతర్జాతీయ జల సంధి, అది ఎవరి ఆధీనంలో ఉండకూడదని అమెరికా పంతం పడుతోంది. ఇరాన్ తాము చెప్పిన రూట్ లో వెళ్లలేదని, సింగపూర్ షిప్ మీద దాడి చేసిన సంగతి తెలిసిందే. హార్ముజ్ నుండి నౌకలు ఎలాంటి టోల్ లేకుండా ఫ్రీగా వెళ్లవచ్చని ట్రంప్ చెప్పారు. కానీ ఇరాన్ ఇలా దాడులు చేయడంతో, ఆ జల సంధిపై తమ పట్టును నిరూపించుకోవడానికి అమెరికా ఇలా ప్రతి దాడికి సమాధానం ఇస్తోంది. యూఎస్ బేస్లను టార్గెట్ చేశాం... మరోవైపు తాము కూడా అమెరికా స్థావరాలను టార్గెట్ చేశామని ఇరాన్ చెప్పింది. అమెరికా దాడులను ఖండించిన ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్, స్థానిక