
ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో ఎదురైన తాజా పరిణామం, ఆయన సుదీర్ఘ న్యాయపోరాటంలో మరో కీలక మలుపుగా మారింది. అదానీపై మోపిన తీవ్రమైన అభియోగాలను కొట్టివేయాలని అమెరికా న్యాయశాఖ (DoJ) నిర్ణయించినప్పటికీ, తుది నిర్ణయానికి ముందు మరిన్ని బలమైన వివరణలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తన నిరపరాధిత్వాన్ని నిరూపించుకునేందుకు అదానీ గ్రూప్ జరుపుతున్న చట్టపరమైన పోరాటంలో ఈ పరిణామం కొంత నిరీక్షణను పెంచింది.బ్రూక్లిన్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరాఫిస్ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో దాఖలు చేసిన నివేదికలో కేసు ఉపసంహరణకు గల కారణాలు స్పష్టంగా లేవని పేర్కొంటూ.. ఈ కేసు ముగింపుపై మరిన్ని సమగ్ర వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు. ఇందుకోసం 2026 జూలై 13 వరకు గడువు విధించారు. దీంతో అదానీ గ్రూప్నకు ఈ నిరీక్షణ ఒక కీలక పరీక్షగా నిలిచింది.చట్టాల పరిమితి - ముగింపు దశకు చేరిన పోరాటంఅమెరికన్ చట్టాల్లోని రూల్ 48(ఎ) ప్రకారం కోర్టులు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం పరిపాటేనని ప్రముఖ అమెరికన్ క్రిమినల్ లాయర్ క్రిస్ మాన్ విశ్లేషించారు. ఒక కేసును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ విభాగం నిర్ణయించుకున్నప్పుడు, వారిని బలవంతం చేసే అధికారం కోర్టులకు చాలా పరిమితంగా ఉంటుందని ఆయన గుర్తుచేశారు. ఇది కేవలం ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమేనని.. గతంలో న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ కేసులో కూడా ఉన్నత స్థాయి సమీక్షల తర్వాతే కేసు వీగిపోయిందని ఉదహరించారు. అదానీ వ్యవహారంలోనూ కొద్దివారాల్లోనే సానుకూల ఫలితం రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.తన నైతిక విలువలను, గ్రూప్ ప్రతిష్టను నిరూపించుకునేందుకు అదానీ బృందం ఇప్పటికే 500 పేజీలతో కూడిన బలమైన ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించింది. ఈ ఆర్థిక వ్యవహారాలేవీ అమెరికా న్యాయ పరిధిలోకి రావని, ఏ ఒక్క అంతర్జాతీయ పెట్టుబడిదారుడు కూడా తమ నిధులను కోల్పోలేదని ఆధారాలతో నిరూపించింది. అదానీ కంపెనీలు బాండ్లు