
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. జీ-7 సదస్సులో తనతో ఫోటో దిగేందుకు మెలోనీ పదేపదే ఆరాటపడ్డారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. జీ-7 సదస్సులో తనతో ఫోటో దిగేందుకు మెలోనీ పదేపదే ఆరాటపడ్డారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ట్రంప్ వ్యాఖ్యలను మెలోనీ ఖండించారు. అయినప్పటికీ, ట్రంప్ తాజాగా మరోసారి అవే వ్యాఖ్యలను పునరావృతం చేశారు (Trump Meloni Photo Row). ఫొటో గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మెలోనీ.. తాను గానీ, ఇటలీ గానీ ఎప్పుడూ, ఎవరినీ వేడుకోలేదని స్పష్టం చేశారు. ట్రంప్ చెప్పిన విషయాలు పూర్తిగా అసత్యమని, వాటిని విని తాను ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. మెలోనీ వివరణ ఇచ్చినప్పటికీ ట్రంప్ మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు. ఫొటో కోసం ఆమె పదేపదే అడిగిన విషయం నిజమేనని మరోసారి అన్నారు (Donald Trump Giorgia Meloni photo). 'స్వదేశంలో మెలోనీకి ప్రజాదరణ తగ్గుతోంది. ఇటలీతో పాటు నాటో మిత్రదేశాలను రక్షించేందుకు అమెరికా ఏటా వందల బిలియన్ల డాలర్లు ఖర్చుపెడుతోంది (Viral Political Controversy). అయినా వాళ్లు మాకు సహకారం అందించలేదు. ఇరాన్పై దాడులు చేసే సమయంలో వారి ఎయిర్బేస్లను వాడుకోనివ్వలేదు. ఇరాన్ను అమెరికా ఓడించిన తర్వాత మెలోనీ మేలుకున్నారు. తన బలాన్ని పెంచుకునేందుకు ఇప్పుడు అమెరికాతో స్నేహం చేయాలని కోరుకుంటున్నారు' అని ట్రంప్ పేర్కొన్నారు. వైరల్ వీడియో.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన చిన్నారి.. ఇదీ జెన్ జీ పవర్.. చెత్తకుప్పలా మారిన నదికి 50 రోజుల్లో జీవం పోశారు