మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు.. నెక్లెస్ రోడ్డులో 'మూసీ ఎక్స్ పీరియన్స్ సెంటర్'
Actor ProfilePolitician

మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు.. నెక్లెస్ రోడ్డులో 'మూసీ ఎక్స్ పీరియన్స్ సెంటర్'

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు.. నెక్లెస్ రోడ్డులో 'మూసీ ఎక్స్ పీరియన్స్ సెంటర్', సీఎం రేవంత్
Samayam Telugu30 Jul 2026
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు.. నెక్లెస్ రోడ్డులో 'మూసీ ఎక్స్ పీరియన్స్ సెంటర్', సీఎం రేవంత్

మూసీ నది పునరుజ్జీవనానికి, మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మూసీ నది తొలి దశ అభివృద్ధి పనులు, భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పన వంటి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నదీ గర్భం పరిధిలో నివసిస్తున్న అర్హులైన పేద కుటుంబాలన్నింటికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను తక్షణమే కేటాయించాలని అధికారులను ఆదేశించారు.ఈ భారీ ప్రాజెక్టు కోసం తమ సొంత భూములు, ఆస్తులను త్యాగం చేయడానికి ముందుకు వచ్చే యజమానులకు ప్రభుత్వం తరఫున ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటించారు. బాధితుల ఇష్టానుసారం వారికి టీడీఆర్‌ (ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌) సర్టిఫికెట్లు ఇవ్వడం లేదా చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం మార్కెట్ విలువకు అనుగుణంగా తగిన ఆర్థిక పరిహారాన్ని చెల్లించాలని అధికారులకు సూచించారు. ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, పారదర్శకంగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.అదేవిధంగా, ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు పురోగతిపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర రక్షణ శాఖ నుంచి సేకరిస్తున్న భూముల్లో ప్రస్తుతం ఉన్న మిలిటరీ లేదా ఇతర నిర్మాణాలను తరలించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించాలని సీఎం ఆదేశించారు. రక్షణ శాఖతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, అక్కడ ఉన్న నిర్మాణాలను సురక్షితంగా, ప్రత్యామ్నాయ ప్రాంతాలకు వేగంగా మార్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు యొక్క అసలు లక్ష్యాలు ఏమిటి? ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో హైదరాబాద్ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? చేపట్టబోయే అభివృద్ధి పనులు ఎలాంటివి? అనే విషయాలను సామాన్య ప్రజలకు సైతం