
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న సంకేతాల నడుమ, ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్'లో మెలోనీని ఉద్దేశించి ఒక విచిత్రమైన మీమ్ పోస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. మెలోనీ తనపై అభిమానంతో ఉన్నట్టుగా చిత్రీకరించిన ఒక ఎడిటెడ్ ఫొటోను షేర్ చేసిన ట్రంప్.. "ఆమె నుంచి నాకు రెస్ట్రెయినింగ్ ఆర్డర్ కావాలి" అంటూ వ్యాఖ్యానించారు. ఈ పరిణామం ఇద్దరు నేతల మధ్య విభేదాలను బహిర్గతం చేసింది.టర్కీలో నాటో దేశాధినేతల సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సులో ట్రంప్, మెలోనీ ముఖాముఖి భేటీ అయ్యే అవకాశం ఉంది. ట్రంప్ ఆదివారం చేసిన పోస్టులలో ఇది ఒకటి. ఇదే క్రమంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల నకిలీ చిత్రాన్ని కూడా ఆయన పంచుకున్నారు.వివాదానికి దారి తీసిన జీ7 సదస్సుగత వారం జరిగిన జీ7 సదస్సులో ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం మొదలైంది. తనతో ఒక ఫొటో దిగేందుకు మెలోనీ పదేపదే అడిగారని, దాదాపు బతిమాలినట్టుగా ప్రవర్తించారని ట్రంప్ ఆరోపించారు. అంతేకాకుండా ఇంధనం, వలసల విషయంలో ఐరోపా దేశాలు పూర్తిగా తప్పుడు విధానాలు అవలంబిస్తున్నాయని, ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఐరోపా భవిష్యత్తు అంధకారమవుతుందని ఆయన విమర్శించారు.ట్రంప్ వ్యాఖ్యలపై ఇటలీ తీవ్రంగా స్పందించింది. ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ, నిరసనగా తన వాషింగ్టన్







