
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Nitin Nabin Telangana Tour: 'ప్రధానమంత్రి మోదీ గ్యారంటీ అంటే అమలయ్యే గ్యారంటీ. కాంగ్రెస్ గ్యారంటీ అంటే ఎప్పటికీ నెరవేరని హామీ అనే విషయం దేశ ప్రజలకు బాగా అర్థమైంది' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జతిన్ నబిన్ విమర్శించారు. 'దేశంలో ఏయే రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయో అక్కడ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. మేము శంకుస్థాపన చేసిన ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేసి ప్రారంభించే బాధ్యతను కూడా మా ప్రభుత్వాలే నిర్వర్తించాయి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం ప్రజలకు అమలుకు నోచుకోని హామీలు ఇచ్చింది. ఇప్పటిదాకా అమలు చేయలేదు' అని తెలిపారు. భవిష్యత్తు ఎంతో ఉజ్వలం హైదరాబాద్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య ప్రసంగం చేశారు. 'తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతోంది. రానున్న కాలం తెలంగాణలో బీజేపీదేననే విశ్వాసం నాకు మరింత బలపడింది' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిన అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించాలనే సంకల్పాన్ని ఈ కార్యవర్గ సమావేశం ద్వారా మనమంతా చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. '1980లో స్థాపించిన బీజేపీ తన తొలి లోక్సభ ఎన్నికల్లో కేవలం ఇద్దరు ఎంపీలను మాత్రమే గెలిపించుకోగలిగింది. ఆ పార్టీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది. ఈ ఘనత పూర్తిగా బూత్ స్థాయి వరకు నిరంతరం శ్రమిస్తూ కమలాన్ని వికసింపజేసిన ప్రతి కార్యకర్తదే' అని ప్రకటించారు. ముగ్గురు మహనీయుల ఆశయాలు 'డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ