
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 19న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజై ఆడియెన్స్ను అలరిస్తోంది. సినిమా తొలి ఆట నుంచే ప్రేక్షకులు, విమర్శకుల నుంచి బ్లాక్బస్టర్ రివ్యూలు అందుకుంటోంది. ముఖ్యంగా సమంత చేసిన పెర్ఫార్మెన్స్కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఆమె చేసిన ఇంటెన్స్ ఫైట్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మా ఇంటి బంగారం సినిమా ఓవర్సీస్ మార్కెట్లలో స్ట్రాంగ్ ప్రీ సేల్స్తోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు వచ్చిన బ్లాక్బస్టర్ టాక్తో ప్రపంచవ్యాప్తంగా ఈ వీకెండ్ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తొలి ఆప్షన్గా మారింది. మొదటి రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా రూ.13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి సమంత కెరీర్లో హయ్యస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళలు, ఈ సినిమాలోని మాస్ హంగామా, హై-ఆక్టేన్ యాక్షన్, మొదటి నుండి చివరి వరకు ఎమోషన్తో నిండిన ఎంటర్టైన్మెంట్ను చూడటానికి థియేటర్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అలాగే సెకండ్ డే కూడా సమంత సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది. రెండు రోజులకు కలిసి సామ్ మా ఇంటి బంగారం సినిమాకు రూ. 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీకి వచ్చిన అద్భుతమైన ఓపెనింగ్ ట్రేడ్ అనలిస్టులను కూడా ఆశ్చర్యపరిచింది. వీరి అభిప్రాయం ప్రకారం ఈ సినిమా వీకెండ్తో పాటు తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర తన జోరును కొనసాగించే అవకాశముంది. మెయిన్ సెంటర్స్లో స్ట్రాంగ్ ఆక్యుపెన్సీ, అలాగే సూపర్ పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా పలు ప్రాంతాల్లో అదనపు షోస్ కూడా పెంచుతున్నారు. హౌస్ఫుల్ థియేటర్లు, ఉత్సాహభరితమైన ప్రేక్షకుల స్పందన, అలాగే