
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఆయన ఇవాళ భేటీ అయ్యారు. ఎన్డీయే సర్కార్ రెండేళ్ల పాలన తర్వాత ప్రభుత్వ పనితీరు, మంత్రుల


ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఆయన ఇవాళ భేటీ అయ్యారు. ఎన్డీయే సర్కార్ రెండేళ్ల పాలన తర్వాత ప్రభుత్వ పనితీరు, మంత్రుల

ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ పంపుతున్న ప్రతినిధి బృందంపై అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వ్యక్తిగతంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినప్పటికీ, భారత్ తన ప్రతినిధులుగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా, బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ (రిటైర్డ్)లను పంపుతోంది. ఈ నిర్ణయం పశ్చిమ ఆసియాలో భారతదేశ వ్యూహాత్మక అడుగులపై సరికొత్త చర్చకు దారితీసింది.ఖమేనీ అంత్యక్రియలకు మోడీ దూరం (Iran)అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో జూలై 4 నుండి 9 వరకు టెహ్రాన్, ఖోమ్, మషద్ నగరాల్లో ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పంపుతున్న బృందం స్థాయిపై విదేశాంగ నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది అంటే 2024లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ విమాన ప్రమాదంలో మరణించినప్పుడు భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ స్వయంగా దౌత్య బృందానికి నాయకత్వం వహించారు. కానీ ఈసారి సహాయ మంత్రి స్థాయి ప్రతినిధిని పంపడం గమనార్హం. ఎట్టకేలకు ఖమేనీ అంత్యక్రియలు..! ప్రధాని మోడీకి పిలుపు..!దౌత్య సమతుల్యత - పాత పరిణామాలుకొందరు విశ్లేషకులు దీనిని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో భారత్కు ఉన్న సంబంధాలను దెబ్బతీయకుండా తీసుకున్న జాగ్రత్తగా అభివర్ణిస్తున్నారు. అయితే, గత చరిత్రను పరిశీలిస్తే, 1989లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా రుహొల్లా ఖొమేనీ అంత్యక్రియలకు కూడా అప్పటి విదేశాంగ మంత్రి పి.వి. నరసింహారావు మాత్రమే హాజరయ్యారని కొందరు గుర్తుచేస్తున్నారు. సుప్రీం లీడర్ పదవికి ఉండే మతపరమైన, రాజకీయ ప్రాముఖ్యత ఆధారంగానే భారత్ తన ప్రతినిధుల ఎంపికను నిర్ణయించి ఉండవచ్చనే వాదన కూడా ఉంది.ఇరాన్ తో మోడీ దౌత్య బంధం భారత్, ఇరాన్ల మధ్య చబహార్ నౌకాశ్రయం అభివృద్ధి వంటి వ్యూహాత్మక ప్రాజెక్టులతో పాటు బలమైన చారిత్రక బంధం ఉంది.