
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ను ప్రత్యేక విచారణ బృందం (సిట్) సుదీర్ఘంగా విచారించింది. హైదరాబాద్, జూన్ 13: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమైంది. ఇందులో భాగంగా ఇవాళ (శనివారం) కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ను ప్రత్యేక విచారణ బృందం (సిట్) సుదీర్ఘంగా విచారించింది. జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయంలో దాదాపు అరగంట పాటు ఈ విచారణ కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో అనిల్ కుమార్ యాదవ్ ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు గుర్తించిన పోలీసులు, ఇందుకు సంబంధించిన కొన్ని సాంకేతిక ఆధారాలను ఆయన ముందు ఉంచి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఏ ఏ రోజుల్లో, ఏ సమయాల్లో ఫోన్ కాల్స్ ట్యాప్ చేశారనే వివరాలను అధికారులు ఆయనకు వివరించినట్లు తెలిసింది. ఇదే కేసులో అనిల్ కుమార్ యాదవ్ తండ్రి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఫోన్ కూడా ట్యాపింగ్కు గురైనట్లు సిట్ నిర్ధారించింది. అయితే, ఆయన వయోభారం, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేరుగా వారి ఇంటికే వెళ్లి స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. గడప దాటకముందే పోలీసులు ఉండేవారు: ఎంపీ అనిల్ కుమార్ సిట్ విచారణ అనంతరం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీ అత్యంత నీచ రాజకీయాలకు పాల్పడింది. నా ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు గుర్తించి నన్ను విచారణకు పిలిచారు. ఏ రోజు, ఏ టైమ్కు ట్యాపింగ్ జరిగిందో కొన్ని కీలక ఆధారాలను నా ముందు ఉంచి వివరాలు అడిగారు. అప్పట్లో మా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము పార్టీ కార్యక్రమాలను ఆర్గనైజ్ చేసేవాళ్లం. అయితే, మేము