తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మానవీయ బంధాలను, సున్నితమైన భావోద్వేగాలను వెండితెరపై ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఆవిష్కరించడంతో మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దిట్ట. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా, కుటుంబ కథా చిత్రాలకు హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను మెప్పించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసి సినిమా నిర్మాణంలో ఓనమాలు నేర్చుకున్న నందిని రెడ్డి నాని, నిత్యామీనన్ జంటగా వచ్చిన ‘అలా మొదలైంది’ (2011) చిత్రంతో దర్శకురాలిగా మారి, మొదటి ప్రయత్నంలోనే బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా ప్రతిష్టాత్మక 'నంది అవార్డు'ను సొంతం చేసుకున్నారు.తొలి సినిమాతోనే టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన నందిని రెడ్డి, ఆ తర్వాత సిద్ధార్థ్, సమంత లతో 'జబర్దస్త్', నాగశౌర్యతో 'కల్యాణ వైభోగమే' చిత్రాలను తెరకెక్కించారు. ఇక కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' ఆధారంగా సమంత ప్రధాన పాత్రలో ఆమె రూపొందించిన ‘ఓ బేబీ’ (2019) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇదే జోష్ లో ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, స్వయంగా నిర్మించిన ‘ మా ఇంటి బంగారం ’ చిత్రానికి కూడా నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలవడంతో, టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా ఆమె పేరు మారుమోగిపోతోంది.* ట్విట్టర్ టాక్: విజువల్స్ అరాచకం.. కథనం వీక్.. 'నాగబంధం' సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? ఇలా కెరీర్ పరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న నందిని రెడ్డి తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, వివాహం, ఒంటరితనంపై సంచలన విషయాలు బయటపెట్టారు. 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా సింగిల్ లైఫ్ లీడ్ చేయడంపై ఆమె చాలా ఓపెన్ గా మాట్లాడారు. జీవితంలో పెళ్లి అనేది డూ ఆర్ డై నిబంధన ఏమీ కాదని స్పష్టం చేశారు
Actor ProfileActor
మొగుడు తప్ప జీవితంలో అన్నీ ఉన్నాయి.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•7 Sept 2026
మొగుడు తప్ప జీవితంలో అన్నీ ఉన్నాయి.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే - నందిని రెడ్డి