
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 19న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్, నందినీ రెడ్డి, శ్రీముఖి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సమంత మాట్లాడుతూ ‘‘‘మా ఇంటి బంగారం’ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. నాకు సింక్ కాలేదు. దీన్నే ప్రతి ఆర్టిస్ట్ కోరుకుంటారు. ప్రతి సినిమాతో బెటర్ కావాలి. పెర్ఫామెన్స్ బెటర్ కావాలని డ్రీమ్లాగా భావిస్తారు. ఈవిషయంలో నేను చాలా లక్కీగా భావిస్తాను. థియేటర్స్లో సినిమాను చూస్తుంటే సర్ప్రైజింగ్గా ఉంది. బస్ ఫైట్, క్లైమాక్స్ అన్నీ ఒకే రోజులో చేశాం. అంత కంట్రోల్డ్గా, వేస్టేజ్ లేకుండా చేశాం. ప్రీ రిలీజ్ ముందే రికవరి కావాలని ప్లానింగ్తో ముందుకెళ్లాం. తొలి రోజు ఎన్ని టికెట్స్ సేల్ అవుతాయనే దానిపై క్లారిటీ లేదు. మూడు సంవత్సరాల తర్వాత చేసిన సినిమా ఇది. కాబట్టి మా బడ్జెట్ను ప్రీ రిలీజ్ సమయంలోనే రికవరీ కావాలని అనుకున్నాం. ఒక స్టార్ హీరోని ఎలా హైప్ చేస్తారో మా టీమ్ నన్నుహైప్ చేశారు. రాజ్ గారు ఈరోల్ రాస్తున్నప్పుడు కమర్షియల్ ఇంపాక్ట్ ఉండేలా రాశారు. ఈరోజు నాగురించి ఇలా మాట్లాడుతున్నారంటే నా క్యారెక్టర్ను ఎలా డిజైన్ చేశారనే కారణం. హీరోయిన్గా నేను చాలా సినిమాలు, కమర్షియల్ సినిమాలు చేశాను. అయితే ఏదో ఒక స్టేజ్లో రిస్క్ అవసరం. లేకపోతే.. ఒకచోటే ఆగిపోతాం. కెరీర్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. కొందరైతే సమంత అయిపోయిందని కూడా రాశారు. హీరోయిన్గా ఇక కష్టమని కూడా అన్నారు. నేను