
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Lt Gen Dhiraj Seth New Army Chief: ప్రభుత్వం శనివారం లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ను తదుపరి ఆర్మీ చీఫ్గా నియమించి.. ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించింది. జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ జూన్ 30న ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ను తదుపరి ఆర్మీ చీఫ్గా నియమించేందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ నియామకం 2026 జూన్ 30 నుంచి అమల్లోకి వస్తుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, లెఫ్టినెంట్ జనరల్ సేథ్ పదవీకాలం 2028 ఆగస్టు 31 వరకు ఉంటుంది. ఈ నెలతో పదవీకాలం ముగియనున్న జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఎవరీ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ? లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ దేశంలోని అత్యంత సీనియర్, అనుభవజ్ఞులైన సైనిక అధికారులలో ఒకరు. ఆయన పూణేలోని ఖడక్వాస్లాలో ఉన్న ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. 1986 డిసెంబర్లో ఆయన భారత సైన్యంలోని ఆర్మర్డ్ కార్ప్స్లో నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ సేథ్ భారతదేశంలో.. విదేశాలలో అనేక ప్రతిష్టాత్మక సైనిక సంస్థల నుండి శిక్షణ పొందారు. అమెరికాలోని కాలిఫోర్నియా, మాంటెరీలో ఉన్న నావల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్లో అంతర్జాతీయ రక్షణ సేకరణ నిర్వహణ కోర్సును పూర్తి చేశారు. అలాగే ఫ్రాన్స్లోని పారిస్లో ఉన్న మిలిటరీ కాలేజీలో డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కోర్సును కూడా పూర్తి చేశారు. అంతేకాదు మధ్యప్రదేశ్లోని మౌలో ఉన్నత కమాండ్ కోర్సులో.. న్యూఢిల్లీలోని