
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు, ముఖ్యంగా భారతీయ ప్రేక్షకులకు ఇది ఒక శుభవార్త. 'ఒపెన్హైమర్', 'ఇంటర్స్టెల్లార్', 'ఇన్సెప్షన్', 'ది డార్క్ నైట్' వంటి అద్భుతమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారిగా భారత్లో అడుగుపెట్టనున్నారు. తన సరికొత్త చిత్రం 'ది ఒడిస్సీ' ప్రీమియర్ కోసం ఆయన జులైలో ముంబైకి రానున్నట్లు యూనివర్సల్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ అధికారికంగా ప్రకటించింది.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నోలన్తో పాటు ఆ చిత్రంలో నటించిన ఆస్కార్ విజేత మ్యాట్ డామన్, ప్రముఖ నటుడు టామ్ హాలండ్, ఆస్కార్ అవార్డు గ్రహీత, నిర్మాత ఎమ్మా థామస్ కూడా హాజరుకానున్నారు. క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఒకటి భారతదేశంలో ప్రీమియర్ జరుపుకోవడం ఇదే మొదటిసారి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 17న థియేటర్లలోకి రానుంది.'ది ఒడిస్సీ' గ్లోబల్ ప్రీమియర్ టూర్లో భాగంగా లండన్, పారిస్, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాలతో పాటు ముంబైని కూడా అధికారికంగా ఎంపిక చేయడం భారతీయ మార్కెట్కు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. హోమర్ రచించిన ఇతిహాసం 'ఒడిస్సీ' ఆధారంగా ఈ చిత్రాన్ని నోలన్ తెరకెక్కించారు. ట్రాయ్ పతనం తర్వాత ఒడిస్సియస్ పదేళ్లపాటు తన ఇంటికి తిరిగి వెళ్లే ప్రయాణాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించనున్నారు.ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. సరికొత్త ఐమ్యాక్స్ (IMAX) ఫిల్మ్ టెక్నాలజీని ఉపయోగించి పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్ ఇదే కావడం విశేషం. ముంబైలోని ఫీనిక్స్ పల్లాడియంలో ఉన్న పీవీఆర్ ఐకాన్ ఐమ్యాక్స్ థియేటర్లో