
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఇంధన భద్రత వంటి అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ భేటీ దౌత్యపరంగానే కాకుండా భారత ప్రజలకు కూడా అనేక ప్రయోజనాలు తీసుకురావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జపాన్ ఇప్పటికే భారత్లో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుల్లో ఒకటి. ఈ పర్యటనలో కొత్త పెట్టుబడులపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, తయారీ, లాజిస్టిక్స్ రంగాల్లో జపాన్ కంపెనీలు తమ కార్యకలాపాలను మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పరిశ్రమలు వస్తే వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు రానున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక పరిశ్రమలకు కూడా ఊతం లభించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో నైపుణ్యం కలిగిన భారతీయులను జపాన్కు పంపే అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. జపాన్లో వృద్ధాప్య జనాభా పెరుగుతుండటంతో అక్కడ నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారత యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇరు దేశాలు ప్రణాళికలు రూపొందించే అవకాశముంది. ఇది అమల్లోకి వస్తే ఇంజినీరింగ్, హెల్త్కేర్, నిర్మాణ రంగం, ఐటీ, తయారీ రంగాల్లో పనిచేసే భారతీయులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించవచ్చు. విదేశీ ఉపాధి ద్వారా కుటుంబాల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారత్ ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దిశగా జపాన్కు ఉన్న సాంకేతిక నైపుణ్యం భారత్కు ఉపయోగపడే అవకాశం ఉంది. చిప్ తయారీ, బ్యాటరీ టెక్నాలజీ, కీలక ఖనిజాల సరఫరా, అధునాతన పరిశ్రమల అభివృద్ధిలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తే భారత తయారీ రంగానికి పెద్ద ఊతం లభిస్తుంది. దీంతో భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ పెరగడంతో పాటు దిగుమతులపై