
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Brs ktr fires on cm revanth reddy govt and bjp: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పీక్స్ కు చేరాయి.ఎక్కడ చాన్స్ దొరికిన కూడా నేతలు పదునైన వాగ్బాణాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజేంద్ర నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణుల సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ పాలనపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగొలు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ అని, అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయ్యిందని సెటైర్లు వేశారు. ఒక సినిమా ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్లకి నష్టం వస్తుంది.. కానీ ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తుందన్నారు. మహిళల్ని కోటీశ్వరుల్ని చేయ్యడం కాదని, ముందుగా వారికి ఇచ్చిన హమీలు నెరవేర్చాలని కోరారు. అత్తకు రూ. 4 వేలు, కోడలికి రూ. 2,500 ఇస్తామన్న హమీల్ని నెరవేర్చాలన్నారు. అంతే కాకుండా..మూసీ ప్రాజెక్టు కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ భూములను కట్టబెట్టిందని గుర్తు చేశారు. పేదవాళ్ల ఇండ్లు కూల్చడం బీజేపీకి ఇష్టం లేకపోతే రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చారని బీజేపీపై మండిపడ్డారు. బడే భాయ్, చోటే భాయ్ ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేద్దామని నిర్ణయించుకున్నారని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. శంషాబాద్ లో ఒక వ్యక్తి తన