
సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తూ రైతులకు బోనస్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వానాకా లం నుంచి ఏడు రకాల సన్నాలకు మాత్రమే చెల్లిస్తామని ప్రకటించడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విషయమై ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నప్పటికీ, రైతులకు అవగాహన కల్పిం చేందుకు ప్రభుత్వం విత్తన మేళా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నది. గతంలో 33రకాల సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించగా, ప్రస్తుతం ఏడు రకాలకే పరిమితం చేసింది. సన్నరకం వరి సాగును ప్రోత్సహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బోనస్ను అందిస్తోంది. చింతలమానేపల్లి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): సన్నరకం వరి సాగును ప్రోత్సహిస్తూ రైతులకు బోనస్ అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ వానాకా లం నుంచి ఏడు రకాల సన్నాలకు మాత్రమే చెల్లిస్తామని ప్రకటించడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ విషయమై ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నప్పటికీ, రైతులకు అవగాహన కల్పిం చేందుకు ప్రభుత్వం విత్తన మేళా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నది. గతంలో 33రకాల సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించగా, ప్రస్తుతం ఏడు రకాలకే పరిమితం చేసింది. సన్నరకం వరి సాగును ప్రోత్సహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బోనస్ను అందిస్తోంది. దీంతో సన్న వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. కానీ ఈ ఏడు వానాకాలం సీజన్లో ప్రభుత్వం చెప్పిన ఏడు రకాల వరి సన్నాలను సాగు చేయాలని కొత్త నిబంధనలు విధించింది. దీంతో అన్నదాతలు అయోమయానికి గురువుతున్నారు. జిల్లాలో వరి సాగు అంతంత మాత్రంగా కన్పిస్తుంది. ప్రభుత్వ నిబంధనలతో సాగు విస్తీర్ణం మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. దొడ్డు రకం వరి పంట సాగు నుండి ఇప్పుడిప్పుడే రైతులు సన్నరకం సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన రకాలను సాగు చేస్తే రూ. 2,461 మద్దతు ధరతో పాటు అదనంగా మరో రూ.500 లను బోనస్గా అందిం చనున్నారు. ఈ ఏడు