
ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ రాజకీయ నేతలపై ఉన్న కేసుల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై 107 కేసులు ఉన్నాయని, ఆయన స్వయంగా తన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు చెప్పినట్లు గుర్తు చేశారు. రాజకీయాల్లో కేసులు సాధారణమేనని, ప్రజా సేవ కోసం పోరాడే నాయకులపై ఎక్కువ కేసులు నమోదవుతాయని లోకేష్ వివరించారు.107 కేసులున్నాయని బండి సంజయ్ చెప్పారన్న లోకేష్ లోకేష్ తనపై 23 కేసులు ఉన్నాయని, ఒకప్పుడు ఇది చాలా ఎక్కువ అని అనుకునేవాడినని చెప్పారు. అయితే టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడగా ఆయనపై 96 కేసులు ఉన్నాయని తెలిసి ఆశ్చర్యపోయానని తెలిపారు. ఆ తర్వాత బండి సంజయ్తో సరదాగా సంభాషించినప్పుడు ఆయన 107 కేసులు ఉన్నాయని నవ్వుతూ చెప్పినట్లు లోకేష్ గుర్తు చేశారు.ప్రజల కోసం పోరాడిన వారిపైనే కేసులు ఇంతమంది నాయకులు ఎన్నో కేసులు ఎదుర్కొని ప్రజల కోసం పోరాడుతున్నారని, ఇది వారి నిబద్దతను చూపిస్తుందని ప్రశంసించారు.రాజకీయ నాయకులు ప్రజల సమస్యల కోసం ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేసినప్పుడు పోలీసులు కేసులు నమోదు చేస్తారని లోకేష్ వివరించారు. కొందరు నాయకులు జైలు శిక్షలు కూడా అనుభవించి మరింత బలపడతారని, ఎక్కువ కేసులు ఉంటే ప్రజల్లో ఆ నాయకుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు.వచ్చే నెల 10వ తేదీ నుంచి టీడీపీ ఇంటింటి ప్రచారం అయితే అవినీతి, కుంభకోణాలు వంటి తప్పుల వల్ల వచ్చే కేసులు వేరని స్పష్టం చేశారు. బండి సంజయ్ కేసులు ఎక్కువ ఉన్నా ఆయన ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారని లోకేష్ ప్రశంసించారు. రాజకీయ పోరాటాల్లో ఇలాంటి కేసులు సహజమని, వాటిని అధిగమించి ప్రజలకు మేలు చేయడమే నిజమైన నాయకత్వం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రతిష్ఠాత్మక ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు