
Maa Inti Bangaram movie: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, తన సొంత బ్యానర్పై స్వయంగా నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. థియేటర్లలోకి వచ్చిన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 13.15 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడంపై చిత్ర యూనిట్తో పాటు సమంత కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ భారీ విజయంపై సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్ రాశారు. “మొదటి రోజు ఒక సినిమాకు ఇంత మంచి ఓపెనింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది. యువత నుంచి పెద్దల వరకు అందరూ సినిమాను ఆశీర్వదించడానికి థియేటర్లకు రావడం గొప్ప అనుభూతినిచ్చింది. సాధారణంగా థియేటర్లకు ఓపెనింగ్స్ను కేవలం మగ ప్రయాణికులు (ప్రేక్షకులు) మాత్రమే తెస్తారని చాలాకాలంగా వింటున్నాం. కానీ, ఈ సినిమాకు మహిళా ప్రేక్షకులు భారీగా తరలిరావడం చూస్తుంటే గర్వంగా ఉంది. సినిమా చూసే ప్రేక్షకుల ఆలోచనలు కూడా ఎదుగుతున్నాయని దీనిని బట్టి అర్థమవుతోంది. మా చిన్న ప్రొడక్షన్ హౌస్ సాధించిన పెద్ద విజయమిది” అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. Read Also : Nagabandham Movie Trailer: ఆసక్తికరమైన థియేట్రికల్ ‘నాగబంధం’ ట్రైలర్ విడుదల ఇటీవలే జరిగిన ఓ ప్రెస్మీట్లో సమంత మాట్లాడుతూ.. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో తాను పోషించిన ‘స్వర్ణ’ పాత్ర తన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని వెల్లడించారు. తాను ఇప్పటివరకు తన సినీ కెరీర్లో చేసిన తెలుగు పాత్రలన్నింటిలో ఇదే తనకు అత్యంత ఇష్టమైనదని సామ్ స్పష్టం చేశారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల గురించి సమంత ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాలో ఎలాంటి ఫేక్ స్లో మోషన్ షాట్లు, బిల్డప్ షాట్లు ఉండవు