
గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఆడియెన్స్ ను తెగ భయపెడుతోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సీన్స్, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. అంతకు ముందు థియేటర్లలోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను భయపెడుతూనే బాక్సాఫీస్ వద్ద రూ.270 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. కేవలం రూ. 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఇక శుక్రవారం (జూన్ 12) ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంటోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై భారీ వ్యూయర్ షిప్ అందుకుంటూ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా కథ మొత్తం ఒక పురాతన ప్యాలెస్ చుట్టూ తిరుగుతుంది. హీరోకు తన పూర్వీకుల నుంచి వారసత్వంగా ఈ పాత కోట వస్తుంది. అయితే ఈ కోట ఉన్న ఊరిని ఒక వింత శాపం వెంటాడుతుంటుంది. అదేంటంటే.. ఒక దుష్ట శక్తి అక్కడి పెళ్లికూతుళ్లను ఎత్తుకెళ్లిపోతుంటుంది. దెయ్యం భయంతో ఊరిలో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోరు. కానీ ఈ విషయం తెలియని హీరో తన చెల్లెలికి అదే ఓల్డ్ ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తాడు. మరి పెళ్లి వేడుక కోసం ఆ కోటలోకి దిగిన హీరో, అతని కుటుంబీకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో తన పెళ్లిని జరిపించాడా? లేదా? అసలు ఆ దెయ్యం కథేంటి? ఆ దుష్ట శక్తిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ. బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ పేరు