
ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ గమ్యస్థానంగా ఏపీ! లక్షలాది మంది భారతీయ యువతకు స్ఫూర్తి రాష్ట్రపతి ముర్ము జీవితం సౌకర్యవంతమైన మార్గాన్ని ఎంచుకునే వారికి విజయం దక్కదు ఉద్యోగార్థులుగా కాదు... ఉద్యోగాల సృష్టికర్తలుగా యువత ఎదగాలి అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ తొలి కాన్వకేషన్ లో మంత్రి లోకేష్ అనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ దూరదృష్టి గల నాయకత్వంలో భారతదేశ జాతీయ విద్యా విధానం (NEP), డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వికసిత్ భారత్ 2047 దార్శనికత ద్వారా విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను (Knowledge based economy) నిర్మిస్తున్నారు. ఈ స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'స్వర్ణాంధ్ర - 2047' దిశగా అడుగులు వేస్తున్నారు. తద్వారా విద్య, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను సృష్టించగల, భవిష్యత్తుకు సంసిద్ధమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఈరోజు యువ పట్టభద్రులతో నిండిన ఈ సభను చూస్తున్నప్పుడు... నాకు కేవలం పట్టాలు స్వీకరిస్తున్న విద్యార్థులు మాత్రమే కనిపించడం లేదు. భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్న ఒక తరం కనిపిస్తోంది. ప్రతి తరానికీ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. భవిష్యత్తును నిర్మించే అవకాశం ఈ తరానికి లభించింది. ఇది మీ సమయం, ఇది మీకు లభించిన గొప్ప అవకాశం. మీ నేపథ్యం మీ భవిష్యత్తును నిర్ణయించేలా ఎప్పుడూ అనుమతించకండి. మీ కలలు, మీ కఠోర శ్రమ, మీ వ్యక్తిత్వం... ఇవే మీరు ఎవరన్నదానిని నిర్వచించేలా చూసుకోండి. Knowledge based economy, ముర్ము జీవితం... స్ఫూర్తిదాయకం ఈరోజు గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారితో కలిసి ఇక్కడ కూర్చునే భాగ్యం మనకు దక్కింది. ఆమె జీవితం కేవలం తరగతి గదిలో