
నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ కల సాకారం స్వయంకృషితో రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి ద్రౌపది ముర్ము గారు విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దుతాం విశాఖలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మంత్రి లోకేష్ విశాఖపట్నం: ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని, నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ నోవాటెల్ హోటల్ లో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ వేడుకకు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రతి తరం ఒక దేశాన్ని వారసత్వంగా స్వీకరిస్తుంది. కానీ ఆ తరం దేశాన్ని ఎలా వదిలి వెళ్తుందో నిర్ణయించేది విద్య. అందుకే విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు అందించే విద్యాసంస్థలు మాత్రమే కావు... అవి కలలకు రూపమిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి, నాయకులను తీర్చిదిద్దుతాయి, తరాల భవిష్యత్తును మార్చేస్తాయి. ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం మాత్రమే కాదు... ఇది అవకాశాల, సమ్మిళిత అభివృద్ధి వేడుక. నాణ్యమైన విద్య దేశంలోని ప్రతి మూలకు, సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలనే విశ్వాసానికి ప్రతీకగా నిలిచే వేడుక. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే వికసిత్ భారత్ కల సాకారం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే, అన్ని వర్గాలు భాగస్వామ్యం అయితేనే వికసిత్ భారత్ కల సాకారమవుతుంది. గిరిజన ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాలు కేవలం విద్యా కేంద్రాలు మాత్రమే కావు... అవి సామాజిక పరివర్తనకు, సమాన అవకాశాలకు మార్గదర్శకాలు. ఒక కుటుంబంలో తొలి తరం విద్యార్థి పట్టభద్రుడైతే... ఆ కుటుంబం మొత్తం ముందుకు సాగుతుంది. దీంతో పాటు దేశం
