ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల బాట.. ఏపీలో భారీ మార్పు
Actor ProfilePolitician

ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల బాట.. ఏపీలో భారీ మార్పు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల బాట.. ఏపీలో భారీ మార్పు
Telugu Times25 Jul 2026
ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల బాట.. ఏపీలో భారీ మార్పు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ పాఠశాలలపై ఈ విద్యా సంవత్సరంలో తల్లిదండ్రుల విశ్వాసం గణనీయంగా పెరిగినట్లు కనిపిస్తోంది. గతంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలకు విద్యార్థులు వెళ్లడం సాధారణంగా కనిపించేది. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం విద్యారంగంలో కొత్త మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం లక్షకు పైగా విద్యార్థులు ప్రభుత్వ బడులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ చేరికల పెరుగుదలకు ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు ప్రధాన కారణంగా నిలిచాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ‘బడి పిలుస్తోంది’ (Badi Pilusthondi) కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం వల్ల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగిందని అభిప్రాయపడుతున్నారు. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన గురించి ప్రజలకు వివరించడం కూడా సానుకూల ఫలితాలను ఇచ్చిందని చెబుతున్నారు. అంతేకాకుండా ‘మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్’ (Mega Parent Teachers Meetings) నిర్వహించడం ద్వారా తల్లిదండ్రులను పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములను చేశారు. పిల్లల చదువు, పాఠశాల నిర్వహణ, అవసరమైన వసతులపై నేరుగా అభిప్రాయాలు తెలుసుకోవడం వల్ల పరస్పర నమ్మకం పెరిగింది. ఈ విధానం ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని తీసుకువచ్చిందని అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్న ఫీజులు కూడా చాలా కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. దీంతో నాణ్యమైన విద్యతో పాటు తక్కువ ఆర్థిక భారం ఉండే ప్రభుత్వ పాఠశాలలను చాలా మంది తల్లిదండ్రులు ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన, పరీక్షల్లో మంచి ఫలితాలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు కూడా ఈ మార్పుకు కారణమయ్యాయి. ప్రభుత్వం ఉపాధ్యాయులను ప్రోత్సహించే చర్యలు కూడా తీసుకుంది. పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు సాధించిన విజయాలను విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ఉపాధ్యాయుల్లో ఉత్సాహం పెరిగిందని