
దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష.. కోలీవుడ్ సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని క్రేజీ ఆన్స్క్రీన్ జంట. వెండితెరపై వీరి కెమిస్ట్రీకి ఎంతటి ఆదరణ ఉందో, నిజ జీవితంలోనూ వీరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి అంతకుమించిన చర్చ జరుగుతూ ఉంటుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమనగా, ఇప్పుడు అనూహ్యంగా వీరి బంధం ముగిసిందనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఊహాగానాలకు విజయ్ పుట్టినరోజున త్రిష ప్రవర్తించిన తీరే బలం చేకూర్చింది.నిన్న విజయ్ పుట్టినరోజు సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఎప్పుడూ విజయ్కు సంబంధించిన విషయాల్లో ముందుండే త్రిష మాత్రం ఈసారి ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండా పూర్తిగా మౌనం పాటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే ఆమె, విజయ్ పుట్టినరోజును ఇలా విస్మరించడం వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే అనుమానాలకు తావిచ్చింది.ఈ మౌనం వెనుక బలమైన కారణం ఉందని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. గతంలో విజయ్ తన భార్య సంగీతతో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారని, ఆ తర్వాత త్రిషను పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత త్రిష, విజయ్ ఇంటికి వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, తాజా సమాచారం ప్రకారం విజయ్, సంగీత మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, వారిద్దరూ తిరిగి కలిసిపోయారనే వార్తలు కోలీవుడ్లో జోరుగా వినిపిస్తున్నాయి.విజయ్ తన కుటుంబంతో