పాకిస్థాన్ లో 125 ఏళ్ల నాటి గురుద్వారా ధ్వంసం.. తీవ్రంగా స్పందించిన భారత్
Actor ProfileCelebrity

పాకిస్థాన్ లో 125 ఏళ్ల నాటి గురుద్వారా ధ్వంసం.. తీవ్రంగా స్పందించిన భారత్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పాకిస్థాన్ లో 125 ఏళ్ల నాటి గురుద్వారా ధ్వంసం.. తీవ్రంగా స్పందించిన భారత్
AP7AM29 Aug 2026
పాకిస్థాన్ లో 125 ఏళ్ల నాటి గురుద్వారా ధ్వంసం.. తీవ్రంగా స్పందించిన భారత్

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారాను పాక్షికంగా కూల్చివేసిన ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. సిక్కుల ప్రార్థనా స్థలాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం తక్షణమే దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పాకిస్థాన్‌లో మైనారిటీలు, వారి ప్రార్థనా స్థలాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలకు స్వస్తి పలకాలని భారత్ విజ్ఞప్తి చేసింది.ఫరూఖాబాద్ (మండి చుర్కానా) ప్రాంతంలోని చారిత్రక గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ సాహిబ్‌పై జూన్ 24 రాత్రి గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గురుద్వారా గుమ్మటం సహా కట్టడంలోని కొన్ని భాగాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిని నివారించడంలో స్థానిక అధికారులు విఫలమయ్యారని పాకిస్థాన్‌లోని సిక్కు సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఈ దుశ్చర్యపై ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ సహా పలు సిక్కు సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పాకిస్థాన్‌లో మైనారిటీల ప్రార్థనా స్థలాలపై తరచూ దాడులు జరుగుతున్నాయని, వాటికి తగిన రక్షణ కల్పించాలని కోరాయి.మైనారిటీల పవిత్ర స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యతను పాకిస్థాన్ విస్మరించకూడదని భారత్ హితవు పలికింది. ధ్వంసమైన గురుద్వారా భాగాలను తక్షణమే పునరుద్ధరించాలని, మైనారిటీ వర్గాలకు, వారి ప్రార్థనా స్థలాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని స్పష్టం చేసింది