
హైదరాబాద్ నగరం ఆప్యాయతకు, సహాయ గుణానికి ప్రసిద్ధి. ఈ కోవలోనే, బాలానగర్ చౌరస్తాలో నిత్యం నిస్సహాయులకు, పేదలకు ఉచిత భోజనాన్ని అందిస్తూ ఆకలిని తీరుస్తోంది అల్ నూర్ ట్రస్ట్. గత నాలుగు సంవత్సరాలుగా ఎడతెగని సేవలతో, ఈ ట్రస్ట్ 365 రోజులు అన్నదానం చేస్తూ 16 లక్షల మంది ఆకలిని తీర్చింది. అల్ నూర్ ట్రస్ట్ బాలానగర్ చౌరస్తాలోని పిల్లర్ నంబర్ P14 వద్ద, సిటీ యూనియన్ బ్యాంక్, బిగ్ సి సమీపంలో తమ ప్రధాన సేవలను అందిస్తోంది. బాలానగర్తో పాటు, ఎర్రగడ్డలో కూడా వారికి ఒక బ్రాంచ్ ఉంది. ప్రస్తుతం, ఈ ట్రస్ట్ మూడు వేర్వేరు లొకేషన్లలో రోజుకు సుమారు 1000 మందికి పైగా ఉచిత భోజనాన్ని అందిస్తోంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంటకు అన్నదానం ప్రారంభమవుతుంది. ఒక రోజుకు ఒక లొకేషన్లో భోజనం కోసం సుమారు రూ.15,000 ఖర్చవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ట్రస్ట్ అందించే భోజనం నాణ్యత, రుచిలో ఎలాంటి రాజీ పడదు. ప్రతిరోజూ విభిన్నమైన మెనూను అందిస్తారు. ఇందులో పప్పు, కూర్మ, దాల్చా వంటి కూరలు, పచ్చడి ఉంటాయి. ప్రత్యేకంగా, శుక్ర శనివారాల్లో వెజ్ బిర్యానీని అందిస్తారు. దాతల నుంచి మంచి విరాళాలు లభిస్తే చికెన్ కూడా అందిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. తినడానికి ఎలాంటి పరిమితులు లేకుండా, ఎవరైనా నచ్చినన్నిసార్లు భోజనం చేయవచ్చని వారు స్పష్టం చేశారు. లాక్డౌన్ సమయంలో కూడా ఈ సేవలు నిరాటంకంగా కొనసాగాయని, నాణ్యత చాలా బాగుందని అక్కడికి వచ్చే లబ్ధిదారులు ప్రశంసిస్తున్నారు. అల్ నూర్ ట్రస్ట్ సేవలకు వెన్నెముకగా నిలుస్తోంది సుమారు పది మంది వాలంటీర్ల బృందం. వీరంతా ఎలాంటి జీతభత్యాలు లేకుండా, స్వచ్ఛందంగా తమ సమయాన్ని, శ్రమను అంకితం చేస్తూ ఈ మహత్తర కార్యంలో పాలుపంచుకుంటున్నారు. వారి నిస్వార్థ సేవలే ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రాణం పోస్తున్నాయి. హైదరాబాద్ ఫ్రీ ఫుడ్ సిటీ అనే నినాదంతో అల్ నూర్ ట్రస్ట్ కేవలం