
తమిళనాడు సీఎం విజయ్ ఇప్పుడు వరుస నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. సీఎంగా బాధ్యత లు చేపట్టిన తరువాత తీసుకుంటున్న నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది. డీఎంకే మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం


తమిళనాడు సీఎం విజయ్ ఇప్పుడు వరుస నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. సీఎంగా బాధ్యత లు చేపట్టిన తరువాత తీసుకుంటున్న నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది. డీఎంకే మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం

ప్రధాని మోదీ 4.0 టార్గెట్ గా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం.. పార్టీలో కీలక మార్పులకు సిద్దం అయ్యారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటుగా.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 12 మంది మంత్రుల తొలిగింపు దాదాపు ఖరారైంది. ఇద్దరు సీనియర్లకు గవర్నర్ పదవులు ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతిని కలిసిన ప్రధాని.. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన పైన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు వేగవంతం అయింది. మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుని కీలక సమాలోచనలు జరిపారు. మరోవైపు ఇద్దరు కేంద్రమంత్రుల రాజ్యసభ పదవీకాలం ముగిసినా.. వారిని తిరిగి ఎంపిక చేయలేదు. వీరిలో ఒకరు బుధవారం మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఈ నెల 26 లేదా 27న ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు (బుధవారం) జరిగే కేంద్ర క్యాబినెట్ భేటీలో పార్లమెంట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, కేరళకు చెందిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ బుధవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ పదవీకాలం ఈ నెల 21న ముగిసింది. ఆయనను కేంద్రం తిరిగి నామినేట్ చేయలేదు. మరోవైపు రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ రాజ్యసభ పదవీకాలం కూడా ఈ నెల 21నే ముగియగా.. ఆమెను కూడా రాజ్యసభకు తిరిగి ఎంపిక చేయలేదు.తెలుగు రాష్ట్రాల నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్- షెడ్యూల్, ముహూర్తం..!!ఈ వారంలోనే ప్రక్షాళనకు అవకాశం..!ఇక కేంద్ర రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష మల్హోత్రాను గత నెలలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరికి చాలా కాలం క్రితమే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో