
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pawan kalyna speech in Janasena national integration meeting in delhi: దేశ రాజధాని ఢిల్లీలో జనసేన పార్టీ తలపెట్టిన సేన ప్రస్థానం.. జాతీయ సమగ్రత కోసం ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీకి చెందిన పార్లమెంట్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కీలక నేతలు హజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనిలో ముఖ్యంగా జనసేన పార్టీ నాలుగు తీర్మానాలను ప్రవేశపెట్టనుంది. జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తొలుత దేశ సేవలో అమరులైన వారికీ నివాళులు అర్పించి ఈ కార్యక్రమంలో తన ప్రసంగం ప్రారంభించారు. ఈ క్రమంలో సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం" అనే విధానంపై విస్తృత స్థాయి సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న సమావేశంకు అనుమతి నిరాకరించడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల నేతలు కొంత మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఢిల్లీ మెడలు వంచుతాం...చొక్కా పట్టుకొని నేలకు దించుతాం.. తమ తడాఖా చూపిస్తామని దక్షిణాది నేతలు రెచ్చిపోతున్నారని అన్నారు. కానీ ఢిల్లీకి వచ్చాక మాత్రం వారి మాటలు, ప్రవర్తనలో ఆ స్పీడ్ మాత్రం కన్పించదన్నారు. దీన్ని బట్టి ఢిల్లీ పాలన గొప్పతనం ఏంటో వారికి కూడా తెలుసని చురకలు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ ఎన్నడూ అడ్డుపడలేదన్నారు. కానీ