
‘వార్-2’ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘డ్రాగన్’. ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలు, ‘సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో మాస్ పల్స్ పట్టుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘వార్-2’ (War 2) సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) నటిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘డ్రాగన్’ (Dragon). ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలు, ‘సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో మాస్ పల్స్ పట్టుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషన్ని క్రియేట్ చేసిన బ్యూటీ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి వస్తున్న అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుండటంతో, సినిమాకు సంబంధించిన చిన్న లీక్ లేదా న్యూస్ అయినా నెట్టింట నిమిషాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్నగర్ సర్కిల్స్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) కూడా ఒక కీలక పాత్రలో మెరవబోతున్నట్లు సమాచారం. గతంలో విడుదల చేసిన గ్లింప్స్ వీడియోలో ప్రశాంత్ నీల్ తన మార్క్ మేకింగ్తో ఎంతోమంది నటీనటులను, వారి పాత్రలను ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ.. అసలు కథ ఏంటనేది, అందులోని మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటనేది ఎక్కడా రివీల్ చేయకుండా చాలా సస్పెన్స్గా ఉంచారట. అయితే, ఈ కథను మలుపు తిప్పే ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ట్రాక్లోనే కృతి సనన్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుందని, ఆమె పాత్ర సినిమాకు చాలా ప్లస్ అవుతుందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. సాధారణంగా