
అఫ్గానిస్తాన్తో మూడో వన్డేకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. అఫ్గాన్తో నామమాత్రపు మ్యాచ్కు అతడు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది. సిరీస్ కైవసం కాగా టీమిండియా ప్రస్తుతం సొంతగడ్డ మీద అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించిన గిల్ సేన.. లక్నో వేదికగా రెండో వన్డేలో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండో వన్డేకు దూరం తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇక తొలి వన్డే ఆడిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి (Nitish Kumar Reddy).. ఆ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఫలితంగా రెండో వన్డేకు దూరమయ్యాడు. అయితే, తాజాగా నితీశ్ రెడ్డి గాయం గురించి బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది. సెలక్షన్కు అందుబాటులో ఉన్నాడు ఈ విషయం గురించి టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నితీశ్ రెడ్డి బాగానే ఉన్నాడు. కోలుకున్నాడు. రేపటి మ్యాచ్ ఆడేందుకు అతడు సిద్ధంగానే ఉన్నాడు’’ అని తెలిపాడు. కాగా టీమిండియా ఇప్పటికే సిరీస్ గెలిచింది. కాబట్టి నితీశ్ రెడ్డి విషయంలో మేనేజ్మెంట్ రిస్క్ తీసుకుంటుందా?.. లేదంటే విశ్రాంతినిస్తుందానేది శనివారం తేలనుంది. కాగా భారత్- అఫ్గానిస్తాన్ మధ్య మూడో వన్డేకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక. చదవండి: IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే! హీరోయిన్ సోనమ్ కపూర్ ఫ్యామిలీ మూమెంట్స్ (ఫొటోలు) సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు ఫిఫా వరల్డ్కప్లో నటి నోరా ఫతేహి సందడి (ఫొటోలు) రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు) మొనాకో వేకేషన్లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు