జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Actor ProfilePolitician

జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Andhra Jyothy13 Jul 2026
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు. మైనింగ్ జరిగే ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేలా సిమ్యులేటర్ యంత్రాలపై మహిళలకు, యువతకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని సందర్శించారు. కర్నూల్, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (బుధవారం) కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో పర్యటించి, ప్రతిష్ఠాత్మకమైన 'జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు'ను (Jonnagiri Gold Mining Project) ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కర్నూల్ జిల్లాలో ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఏపీ ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించడంలో అత్యంత కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మైనింగ్ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు, స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఏపీలో పారిశ్రామిక వృద్ధికి, మైనింగ్ రంగానికి ఈ ప్రాజెక్ట్ ఒక కొత్త దిక్సూచిగా మారి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడనుంది. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పెట్టుబడులు, ఉత్పత్తి లక్ష్యాలు, ప్రత్యేకతల వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మొత్తం పెట్టుబడి: ఈ ప్రతిష్ఠాత్మక బంగారు గనుల ప్రాజెక్టు కోసం రెండు ప్రముఖ మైనింగ్ సంస్థలు కలిసి రూ. 405 కోట్ల భారీ పెట్టుబడి పెట్టాయి. నిర్వహణ సంస్థలు: జియోమైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును చేపట్టాయి. జొన్నగిరి మైనింగ్ క్షేత్రంలో బంగారు ఉత్పత్తిని దశలవారీగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి దశ: ఏడాదికి 400 కేజీల బంగారు ఉత్పత్తితో మైనింగ్ ప్రారంభం కానుంది. రెండో దశ: తదుపరి కాలంలో దీనిని ఏడాదికి 900 కేజీలకు పెంచుతారు. తుది