
ఆంటిగ్వా వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక రెండు ఇన్నింగ్స్ల్లో ఆలౌట్ కాగా.. విండీస్ ఒకే ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి, ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులకు ఆలౌటైన విండీస్.. రెండో ఇన్నింగ్స్లో 101 పరుగులకే కుప్పకూలి ఘోర ఓటమిని మూటగట్టుకుంది. విండీస్ బౌలర్లు (11-0-5-4), జేడన్ సీల్స్ (10.2-3-14-3), షమార్ జోసఫ్ (5-0-19-2), అల్జరీ జోసఫ్ (5-1-11-1) లంక బ్యాటర్లకు చుక్కులు చూపించారు. వీరి ధాటికి లంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. దినేశ్ చండీమల్ (43), సోనల్ దినుష (12 నాటౌట్) మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. అంతకుముందు అమిర్ జాంగూ (233) డబుల్ సెంచరీతో, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (194) భారీ శతకంతో కదంతొక్కడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్లో 626 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాంగూ-ఛేజ్ ఆరో వికెట్కు రికార్డు స్థాయిలో 401 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో మిలన్ ప్రియానాథ్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అషిత ఫెర్నాండో, సోనల్ దినుష తలో 2 వికెట్లు తీశారు. దీనికి ముందు ధనుంజయ డిసిల్వ (120) సెంచరీతో కదంతొక్కడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులు చేసింది. దినేశ్ చండీమల్ (54) అర్ద సెంచరీతో రాణించాడు. దినుష 43 పరుగులతో పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో గ్రీవ్స్ 3, రోచ్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్ తలో 2, సీల్స్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్ రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగింది. రెండో టెస్ట్ అంటిగ్వా వేదికగానే జులై 3న ప్రారంభం కానుంది. ఈ సిరీస్ల కోసం శ్రీలంక వెస్టిండీస్లో పర్యటిస్తుంది. టెస్ట్లకు ముందు 3 మ్యాచ్ల టీ20 సిరీస్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరిగాయి. వన్డే సిరీస్ను