
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం... పారిశ్రామిక, ఆర్థిక వర్గాలను కుదిపేసేలా ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. చెన్నై నగర శివార్లలో రూ. 29,143 కోట్ల భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన పరంధూర్ గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టును తాత్కాలికంగా హోల్డ్లో పెట్టాలని ఆదేశించింది. ఇప్పటికే 60 శాతం భూసేకరణ పూర్తయిన ఈ మెగా ప్రాజెక్టును నిలిపివేస్తూ సమీప భవిష్యత్తులోనే అధికారిక జీవో వచ్చే అవకాశం ఉండటంతో, ఈ పరిణామం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.రద్దీలో చెన్నై వెనుకబాటు.. పొరుగు రాష్ట్రాల ముందంజప్రస్తుత చెన్నై విమానాశ్రయం ఏడాదికి 2.2 కోట్ల మంది ప్రయాణికులతో గరిష్ట రద్దీని ఎదుర్కొంటోంది. దేశంలోని ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ (13.7 కోట్లు), బెంగళూరు (9 కోట్లు), హైదరాబాద్ (4.5 కోట్లు) సామర్థ్యంతో పోలిస్తే చెన్నై కేవలం 3.5 కోట్ల గరిష్ట రద్దీని మాత్రమే తట్టుకోగలదు. ఇటువంటి తరుణంలో పరంధూర్ ప్రాజెక్టును నిలిపివేస్తే, దక్షిణ భారతదేశంలో డ్యూయల్ ఎయిర్పోర్ట్ సిస్టమ్’ లేని ఏకైక నగరంగా చెన్నై మిగిలిపోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ ఎలైన్మెంట్ మార్పు, కొత్త రూట్ ఇదే..!!ఎంపిక వెనుక సైన్స్.. 1 ట్రిలియన్ డాలర్ల కలభారత విమానాశ్రయాల అథారిటీ నిపుణులు నాలుగు ప్రాంతాలను పరిశీలించి, తక్కువ అడ్డంకులు, నాణ్యమైన ఎయిర్స్పేస్, చెన్నై-బెంగళూరు ఎక్స్ప్రెస్వేకు సమీపంగా ఉండటం వల్ల పరంధూర్ను ఎంపిక చేశారు. పైగా ఇక్కడ కేవలం 1,005 కుటుంబాలు మాత్రమే తరలించాల్సి వస్తుంది. శ్రీపెరమ్బుదూర్ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ హబ్లకు బూస్టర్గా నిలిచే ఈ ప్రాజెక్ట్ ద్వారా తొలి దశలోనే 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.భోగాపురం వద్దు-విశాఖలోనే ఎయిర్ పోర్టు-బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్..!పెట్టుబడిదారుల్లో ఆందోళనప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిలిపివేస్తే గ్లోబల్ ఇన్వెస్టర్లలో ప్రతికూల ముద్ర పడుతుందని పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి