
ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరో హీరోయిన్లుగా, ప్రముఖ నటుడు సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో, బి.వి.సి ఫిల్మ్స్ బ్యానర్పై, ‘Eట్లు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకుడిగా . విభిన్న కథా చిత్రం ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్లోని అమీర్పేట సారథి స్టూడియోస్లో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లాప్ కొట్టారు. లయన్ వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేయాగా, తొలి షాట్ కు టీఎఫ్సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ దర్శకత్వం వహించారు. పలువురు అతిథులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ, “ఈ సినిమా కథలో హారర్, థ్రిల్లర్ అంశాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. కథ నాకు బాగా నచ్చింది. ఇందులో నటి ఆమనితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. చిన్న నిర్మాతలను ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు, ప్రోత్సాహక పథకాలు తీసుకురావాలి. చిన్న సినిమాలు నిలబడితేనే సినీ పరిశ్రమలో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది” అని అన్నారు. దర్శకుడు రోశిరెడ్డి పందిళ్లపల్లి మాట్లాడుతూ, “ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ‘నిమ్మకాయ’ చుట్టూ ఉన్న అపోహలను కథాంశంగా తీసుకుని వినోదాత్మకంగా, ఆలోచింపజేసేలా సినిమాను తెరకెక్కిస్తున్నాం. కథలో ఎక్కువ భాగం నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఉంటుంది. సుమన్, ఆమనీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు” అని తెలిపారు. హీరో రాజేష్ భూపతి మాట్లాడుతూ, “ఇది నాకు తొలి చిత్రం. నిమ్మకాయను ఇప్పటికీ చాలామంది మూఢనమ్మకాలతో అనుసంధానించి చూస్తుంటారు. అలాంటి అంశాలను కొత్త కోణంలో నిజాలను చూపించే ప్రయత్నం ఈ సినిమా. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నాకు అవకాశం ఇచ్చిన