ఘోరం.. కడుపులోనే కత్తెర మర్చిపోయిన వైద్యులు.. తల్లి బిడ్డ మృతి
Actor ProfilePolitician

ఘోరం.. కడుపులోనే కత్తెర మర్చిపోయిన వైద్యులు.. తల్లి బిడ్డ మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఘోరం.. కడుపులోనే కత్తెర మర్చిపోయిన వైద్యులు.. తల్లి బిడ్డ మృతి
Vaartha19 Jun 2026
ఘోరం.. కడుపులోనే కత్తెర మర్చిపోయిన వైద్యులు.. తల్లి బిడ్డ మృతి

Bhadradri Incident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న వైద్యుల నిర్లక్ష్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. వైద్య సిబ్బంది బాధ్యతారాహిత్యం కారణంగా చాట్ల వనజ (20) అనే బాలింతతో పాటు ఆమె నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో అంత్యక్రియల అనంతరం వెలుగులోకి వచ్చిన ఒక షాకింగ్ నిజం బాధితురాలి కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. Read Also: El Nino impact: ఎల్‌నినో దెబ్బ.. భారత్‌లో 10 శాతం తగ్గనున్న వర్షపాతం బాధిత కుటుంబ సభ్యులు వనజ అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత, చితి బూడిదను సేకరిస్తుండగా అక్కడ ఒక సర్జికల్ కత్తెర (వైద్యులు ఆపరేషన్లకు వాడే కత్తెర) లభ్యమైంది. ప్రసవం చేసిన సమయంలో వైద్య సిబ్బంది కత్తెరను కడుపులోనే మర్చిపోయి కుట్లు వేసేశారని, దానివల్లే లోపల తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకి, రక్తస్రావమై వనజ మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆధారంతో వారు ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనజకు పురిటి నొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ డ్యూటీలో ఉండాల్సిన వైద్యులెవరూ అందుబాటులో లేరు. దీంతో అక్కడి స్టాఫ్ నర్సే ప్రసవం చేయగా, పుట్టిన కాసేపటికే నవజాత శిశువు మృతి చెందింది. ఆ తర్వాత తల్లి వనజకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మీడియాలో సోషల్ మీడియాలో విసృతంగా వైరల్ కావడంతో ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. ప్రాథమిక విచారణ అనంతరం విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గానూ గుండాల వైద్యాధికారిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘోరానికి కారకులైన మిగిలిన సిబ్బందిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. El Nino impact: ఎల్‌నినో దెబ్బ.. భారత్‌లో