
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Delhi Uttarakhand Terror Threat: ఖలిస్తానీ ఉగ్రవాద ముప్పు పొంచి ఉందంటూ నిఘా సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికలతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ రెండు ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈమెయిల్ బెదిరింపులతో హై అలర్ట్! ఢిల్లీ, ఉత్తరాఖండ్లలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరిస్తూ భద్రతా సంస్థలకు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. అందులోని సమాచారం ప్రకారం.. పలు ప్రముఖ దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, రాజకీయ నాయకులు, అలాగే పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడవచ్చని నిఘా సంస్థలు గట్టిగా అనుమానిస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం ఈ ఈమెయిళ్ల మూలాలపై ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్లో నిహాంగ్ సిక్కులకు, స్థానిక పోలీసులకు మధ్య జరిగిన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ భద్రతా హెచ్చరికలు రావడం గమనార్హం. అసలేం జరిగింది? జూన్ 16 (చమోలి ఘటన): హేమకుండ్ సాహిబ్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న నిహాంగ్ యాత్రికులకు, కర్ణప్రయాగ్లోని స్థానిక వ్యాపారులకు మధ్య చిన్న గొడవ జరిగింది. ఇది కాస్తా హింసాత్మకంగా మారి, నలుగురు నిహాంగ్ సిక్కులు కత్తులతో దాడి చేయడంతో నలుగురు స్థానికులు గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిహాంగ్లను అరెస్ట్ చేశారు. తమ వారిని విడుదల చేయాలంటూ నిహాంగ్ సిక్కుల