
Eenadu•15 Jun 2026
కర్నూలులో సందడి చేసిన నాగబంధం’ చిత్ర బృందంకర్నూలు: నగరంలో నాగబంధం చిత్ర బృందం సందడి చేసింది. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద అనంత పద్మనాభ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి ఈ సినిమా ప్రమోషన్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరో విరాట్ కర్ణ, హీరోయిన్ నభా నటేష్, కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు పాల్గొన్నారు. సినిమా ప్రమోషన్ను కర్నూలు నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందని సినీనటులు తెలిపారు. యువతకు పురాణ కథలు, దేవాలయాల గురించి సినిమాలో చూపించామన్నారు. జులై 3వ తేదీన ఈ చిత్రం విడుదలవుతుందని, అందరూ ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా కొండారెడ్డి బురుజు వద్ద హీరోయిన్ డ్యాన్స్తో సందడి చేశారు. ఈ వార్త చదివారా : రాజ్ నిడిమోరు బాలీవుడ్ చిత్రం.. సూపర్ హీరోగా సల్మాన్ ఖాన్?