
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధ్యక్షుడు సి.జోసెఫ్ విజయ్, ఆయన భార్య సంగీత దాఖలు చేసుకున్న విడాకుల పిటిషన్పై సోమవారం చెంగల్పట్టు ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు విచారణ జరపనుంది. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ కేసు విచారణకు రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.విజయ్తో తన వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ సంగీత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. వారిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయని, విజయ్ తనను మానసికంగా వేధించారని తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఒక ప్రముఖ నటితో విజయ్కు వివాహేతర సంబంధం ఉందని కూడా ఆమె ఆరోపించినట్లు సమాచారం. విడాకులతో పాటు విజయ్ సామాజిక, ఆర్థిక హోదాకు తగినట్లుగా భరణం, అలాగే చెన్నైలోని నీలంకరైలో ఉన్న వారి నివాసంలోనే తాను నివసించే హక్కును కల్పించాలని సంగీత కోరారు.గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు విజయ్ గానీ, సంగీత గానీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేదు. వారి తరఫు న్యాయవాదులు మాత్రమే వాదనలు వినిపించారు. తమ క్లయింట్లు ప్రముఖులు కావడంతో, వ్యక్తిగతంగా హాజరైతే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, అందువల్ల వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు అనుమతించాలని న్యాయవాదులు కోరారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, విచారణను జూన్ 15వ తేదీకి వాయిదా వేసింది.ఈ నేపథ్యంలో, సోమవారం జరగనున్న విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. విజయ్ వ్యక్తిగతంగా కోర్టుకు వస్తారా? లేక వర్చువల్గా పాల్గొంటారా? అనేది వేచి చూడాలి. మరోవైపు, విజయ్-సంగీత జంటను తిరిగి కలిపేందుకు వారి సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ