
టాలీవుడ్ లో క్రేజీ యాంకర్స్ లో లాస్య ఒకరు. పెళ్లయ్యాక లాస్య బుల్లితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం లాస్య తన భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తన గ్లామర్, చలాకీగా మాట్లాడే ట్యాలెంట్ తో యాంకర్ గా లాస్య ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకుంది. యాంకర్ గా రాణిస్తున్న రోజుల్లో లాస్య ఎన్నో రూమర్స్ ని ఎదుర్కొంది. తనకి ఎదురైన ఇబ్బందులని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. లాస్య, యాంకర్ రవి జోడీ బుల్లితెరపై సూపర్ హిట్ అయింది. వీళ్ళిద్దరూ కలసి చేసిన షోలు సూపర్ సక్సెస్ అయ్యాయి. లాస్య మాట్లాడుతూ..ఆ సమయంలో రవి నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నేనైతే రవిని మంచి ఫ్రెండ్ గానే భావించా. ఇగోల వల్లే విభేదాలు మొదలయ్యాయి. మా ఇద్దరికీ ఫేమ్ వచ్చాక అందరూ రవిని సంప్రదించడం ప్రారంభించారు. మీ ఇద్దరితో ఒక షో ప్లాన్ చేస్తున్నాం అని రవిని అడిగేవారు. రవి ఓకె చేసేశాక నాకు చెప్పేవాడు. అదేంటి నేను కూడా యాంకర్ నే కదా.. నన్ను అడగాలి కదా అనే చిన్న బాధ మొదలైంది. ఆ విషయం రవికి చెబితే నీకు ఫేమ్, కెరీర్ వచ్చిందే నా వల్ల అని అన్నాడు. అక్కడ చాలా బాధపడ్డాను. రవి ట్యాలెంటెడ్ కావచ్చు కానీ.. నాలాంటి క్యూట్ అమ్మాయి పక్కన లేకుంటే మేము చేసిన షోలు అంత పాపులర్ అయ్యేవి కాదు కదా అని లాస్య పేర్కొంది. అప్పటి నుంచి రవికి దూరం అవుతూ వచ్చినట్లు లాస్య పేర్కొంది. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఓ వ్యక్తి నన్ను పర్సనల్ గా బాగా ఇబ్బంది పెట్టాడు. అతడికి ఆల్రెడీ పెళ్లయింది. అయినప్పటికీ నువ్వంటే నాకు ఇష్టం..నీ కోసం నా భార్యకి విడాకులు ఇస్తాను అని వెంటపడేవాడు. అది నాకు కరెక్ట్ అనిపించలేదు. అతడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అయింది. కానీ చివరికి ఎలాగోలా బయటపడ్డా అని