
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ మధ్య కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇక ప్రజల్లోకి తమ విజయాలను తీసుకెళ్లాలని డిసైడ్ అయింది. ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలకు సిద్దం కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే గోదావరి జిల్లాలే కేంద్రంగా వైసీపీ కాపు రాజకీయంలో కీలక అడుగు వేస్తోంది. పార్టీ తాజా నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.ఏపీలో 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త రాజకీయం మొదలైంది. గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం తో 2024 ఎన్నికల్లో వైసీపీ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాపు సామాజిక వర్గంలో మెజార్టీ ఓటర్లు కూటమికే మద్దతు ప్రకటించారు. ఇక.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తరువాత వైసీపీ కొత్త వ్యూహం మొదలు పెట్టింది. కాపు వర్గానికి దగ్గర అయ్యేందుకు.. వారితో మమేకం అయ్యేలా వ్యూహాలు సిద్దం చేస్తోంది. తాజాగా పార్టీలోని కాపు ముఖ్య నేతలు తోట త్రిమూర్తులు, అంబటి , కన్నబాబు తో సహా మరికొందరు ఇతర నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశం అయ్యారు. తాజాగా గోదావరి జిల్లాల్లో మారుతున్న లెక్కలు.. క్షేత్ర స్థాయి సమాచారం పైన చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న అంశాల పైన సుదీర్ఘంగా చర్చించారు.రూటు మార్చిన పవన్, జనసేనలోకి వారికి ఆహ్వానం- బాలినేనికి బాధ్యతలు..!!21న కాపు నేతల కీలక సమావేశంవైసీపీ హయాంలో అమలు చేసిన కాపు నేస్తం వంటి పథకాల పైనా లోతుగా చర్చ చేసారు. ఇదే సమయంలో పార్టీలోని కాపు నేతలంతా సమావేశం నిర్వహించి... ఏ విధంగా రాజకీయ వ్యూహాలు అమలు చేయాలనేది డిసైడ్ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 21వ తేదీన మాజీ మంత్రి.. ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రామచంద్రాపురంలోని