
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. 8th Pay Commission Attendance Rules: కేంద్రంలో మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 8వ పే కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇది పనితీరు ప్రారంభించి దాదాపు 6 నెలల గడిచింది. మరో 11 నెలల్లో 8వ పే కమిషన్ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి అందనున్నాయి. మొత్తం 18 నెలల పాటు జరగనున్న ఈ అధ్యయనంలో 1 కోటి మందికిపైగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సర్వీసులను సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నారు. 8వ వేతన సంఘం ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాల నుంచి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి తమ విజ్నప్తులను పంపించాల్సిన చివరి తేదీని నిర్ణయించగా ఆ చివరి తేదీ కూడా దాటింది. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను 8వ పే కమిషన్ ముందుంచాయి. వాటిలో ముఖ్యమైంది అటెండెన్స్, లీవ్ నిబంధనలు. వీటిపై కొన్ని కీలకమైన డిమాండ్లను వేతన సంఘం ముందుకు పెట్టారు. ఉద్యోగ సంఘాలు చేసిన ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగులకు నెలకు 2 సార్లు ఒక 1గంటల వరకు ఆఫీసుకు ఆలస్యంగా వచ్చే అనుమతి ఉంది. ఈ పరిమితి దాటి ఎన్నిసార్లు ఆలస్యంగా ఆఫీసుకు వస్తే ప్రతిసారి వారి అకౌంట్ నుంచి సగం రోజు క్యాజువల్ రూపంలో కట్ అవుతుంది. దీనిపై మార్పులు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం నగరాల్లో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయినందున బయో మెట్రిక్ విధానం అన్ని నగరాల్లో అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ కఠినమైన హాజరు నిబంధనలను సడలించాలని నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ఉద్యోగ సంఘం డిమాండ్ చేసింది. దానికి