ఒకప్పుడు కోతులు, అడవి పందుల గుంపులు ఆ గ్రామాల్లోని రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసేవి. కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి అడవి పందులు, కోతులు పొలాలపై పడి ధ్వంసం చేసేవి. ఈ విధ్వంసం కారణంగా పెట్టుబడులు కూడా రాక రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. కానీ ఇప్పుడు ఆ రైతులకు వన్యప్రాణుల బెడద పూర్తిగా తొలగిపోయింది. సౌర విద్యుత్ కంచె సాంకేతికత వారి పంటలను కంటికి రెప్పలా కాపాడుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 30 మంది రైతులు సాధించిన ఉమ్మడి విజయమిది. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు, స్థానిక స్వచ్ఛంద సంస్థల ఉమ్మడి ఆర్థిక, సాంకేతిక సహకారంతో వారు తమ పొలాల చుట్టూ ఈ సౌరకంచెలను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలోని తుర్కపల్లి, భువనగిరి మండలాల్లో కోతులు, అడవి పందుల దాడితో రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్న తరుణంలో పిలుపు అనే స్వచ్ఛంద సంస్థ ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించింది. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న దుస్థితిని సవివరంగా నాబార్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సానుకూలంగా స్పందించిన నాబార్డు అధికారులు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ప్రాథమికంగా ప్రయోగాత్మక దశలో నలుగురు రైతులను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించారు. ఒక ఎకరా భూమి చుట్టూ సౌరవిద్యుత్ కంచె ఏర్పాటు చేయడానికి మొత్తం రూ.30 వేలు ఖర్చు కాగా.. అందులో రూ.19 వేల మొత్తాన్ని నాబార్డు గ్రాంటుగా అందించింది. మిగిలిన రూ.11 వేల మొత్తాన్ని రైతులు తమ వాటా కింద భరించారు. రైతులకు కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా సోలార్ ప్యానెల్, బ్యాటరీ, ప్రత్యేక తీగలను కొనుగోలు చేసి ఇచ్చి వాటిని ఎలా నిర్వహించాలో శిక్షణ కూడా ఇచ్చారు.మొదటి విడత ప్రయోగం విజయవంతం కావడంతో.. ఆర్డీఎస్ఎస్, ఏఐడీ వంటి ఇతర స్వచ్ఛంద సంస్థలు దాతల సహాయంతో ముందుకు వచ్చాయి. వీటి సహకారంతో మరో 26 మంది రైతులు తమ పొలాలకు సౌరకంచెలను
Samayam Telugu•18 Jun 2026
కోతులు, అడవి పందుల బెడదకు చెక్.. ఇదుంటే పంటలకు రక్ష, యాదాద్రి రైతుల అద్భుత విజయం