
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక అధికారిక కార్యక్రమాన్ని తనదైన శైలిలో ఎంతో ఉత్సాహంగా, చిరస్మరణీయంగా మార్చారు. బుధవారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో 'ట్యాంజెడ్కో' (విద్యుత్ బోర్డు)కు కొత్తగా ఎంపికైన వారికి ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కొందరు ఉద్యోగులు కోరిన సరదా విన్నపాలను ఆయన మన్నించి అక్కడి వారందరినీ ఆకట్టుకున్నారు.తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రాష్ట్ర విద్యుత్ శాఖకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి విజయ్ నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ క్రమంలో ఒక నూతన ఉద్యోగి తన కుటుంబ సభ్యులకు 'హాయ్' చెప్పాలని కోరగా, విజయ్ చిరునవ్వుతూ కెమెరా వైపు చూసి అభివాదం చేశారు.మరొక అభ్యర్థి 'హార్ట్ సింబల్' చూపించమని కోరగా, ఆయన ఆ విన్నపాన్ని కూడా తీర్చారు. దీంతో సభ ప్రాంగణమంతా చప్పట్లు, కేరింతలతో సందడిగా మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం పార్టీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించారు