
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Cockroach Janta Party protest in Jaipur goes controversy: దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ప్రస్తుతం కాక్రోచ్ జనాతా పార్టీ గురించి చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో కాక్రోచ్ జనాతా పార్టీ ఇటీవల నీట్ పేపర్ లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా రాజస్థాన్ లోని జైపూర్ లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి భారీగా కాక్రోచ్ పార్టీ సానుభూతి పరులు తరలివచ్చారు. ఈ క్రమంలో పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కార్యకర్తల్ని ఉద్దేషించి ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని ఆగంతకుడు అతనిపై దాడికి దిగాడు. రాజస్థాన్ లోని జైపూర్లోని శహీద్ స్మారక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా యువత తరలివచ్చారు. ఈ క్రమంలో పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సభా ప్రాంగణానికి చేరుకున్న సమయంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సభా స్థలంలోకి చేరుకుంటున్న అభిజీత్ దిప్కేను గుర్తుతెలియని యువకుడు అకస్మాత్తుగా చెంపదెబ్బ కొట్టాడు. అంతే కాకుండా పలు మార్లు దాడికి యత్నించాడు. దీంతో పక్కనే ఉన్ననే ఉన్న కాక్రోచ్ జనాతా పార్టీ కార్యకర్తలు అతడ్ని వారించి పక్కకు లాక్కెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టిగా నినాదాలు చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈనేపథ్యంలో కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజీత్ దిప్కే వెంటనే