
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan), క్రేజీ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ (OG) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan), క్రేజీ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ (OG) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఒక వీరాభిమాని అయిన దర్శకుడు తన అభిమాన హీరోని వెండితెరపై ఎలా చూడాలనుకుంటాడో.. అంతకుమించి పవర్ స్టార్ను సుజీత్ ఆవిష్కరించాడు. దీంతో ఓజీ-2 కోసం సినీ ప్రేక్షకులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓజీ యూనివర్స్ చుట్టూ రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా స్టోరీ డెవలప్మెంట్స్కు సంబంధించి స్వయంగా డైరెక్టర్ సుజీత్ హీరో పవన్ కళ్యాణ్ను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా కథకు సంబంధించి ఒక సెన్సేషనల్ లీక్ ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రంలో కేవలం ముంబై ముఠా రాజకీయాలు, గ్యాంగ్స్టర్ డ్రామా మాత్రమే కాకుండా.. దేశభక్తి బ్యాక్డ్రాప్తో కూడిన ఒక భారీ చారిత్రాత్మక అంశాన్ని కూడా సుజీత్ జోడించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. నిజం చెప్పాలంటే.. ఈ టాక్ ఓజీ రిలీజ్ కాకముందు నుంచి నడిచింది. మొదటి భాగంలో కథ 1940లలో మొదలై, 1973 ప్రాంతంలో సాగుతూ 1993లో ముగుస్తుంది. అయితే ఓజీ సీక్వెల్ లేదా ప్రీక్వెల్లో భాగంగా 1940ల నాటి కాలానికి సంబంధించిన పూర్తి కథను, గంభీర వంశ మూలాలను చూపించబోతున్నారట. ఇక్కడే దర్శకుడు సుజీత్ ఒక ఊహించని చారిత్రక ట్విస్ట్ ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎలిమెంట్ను ఈ స్టోరీకి ముడిపెట్టినట్లు తెలుస్తోంది. 1940లలో ఆజాద్ హింద్ ఫౌజ్ (INA)